శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 20 మే 2015 (13:57 IST)

టాలీవుడ్‌కు మరో బాలీవుడ్ బ్యూటీ... సచిన్ జోషి సరసకు రెడీ..

వెండితెరపై అందాల ఆరబోతకు దక్షిణాది తారలు కొంత వెనకడుగు వేసినా, ఉత్తరాధి భామలు మాత్రం వెనుకాడరు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌‌లో అందాల ప్రదర్శనకు అప్పుడప్పుడూ బాలీవుడ్ బ్యూటీలు దిగుమతి అవుతుంటారు. ఆ వరుసలో తాజాగా మరో బాలీవుడ్ సుందరి ఈషా గుప్తా తెలుగు తెరకు పరిచయం కానుంది. 
 
'భీమిలి కబడ్డీ జట్టు', 'ఎస్సెమ్మెస్', 'శంకర' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పింది. ఈ చిత్రంలో హీరో సచిన్ జోషి సరసన నటించేందుకు ఈషా గుప్తా సైన్ చేసింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషినే నిర్మిస్తున్నాడు. మే నెల 27 నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది.