'సెక్సీ తార చెర నుంచి నా భర్తను విడిపించండి..'! అల్ఫోన్సాపై కమిషనర్కు ఫిర్యాదు..!
టాలీవుడ్ సెక్సీ బాంబ్ అల్ఫోన్సాపై ఒక యువతి పోలీసులు కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఆమె చెరలో ఉన్న తన భర్తను విడిపించండి అంటూ ఆ యువతి కోరింది. వివరాల్లోకి వెళితే.. నాగర్కోయిల్ జిల్లా మైలాడుదురైకి చెందిన మహిళ శశికళ (32). ఎంసీఏ పూర్తి చేసిన ఈమె మంగళవారం చెన్నై పోలీసు కమిషనర్కు ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో... నేను చెన్నైలో ఎంసీఏ చదువుతున్న రోజుల్లో, జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమించినట్టు తెలిపింది.
తామిద్దరూ ఒకటిగా చుదువుకున్నట్టుగాను, తాము వేరువేరు వర్గానికి చెందిన వారిమి కావడంతో తొలుత తమ ప్రేమకు కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదురైందని, అయితే ఎనిమిదేళ్ల తర్వాత తమ ప్రేమను ఇరు కుటుంబీకులు అంగీకరించారని తెలిపింది. అనంతరం 2013, జూలై నెలలో మరుదమలై వివాహం చేసుకున్నట్టు తెలిపింది. తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకున్నట్టు చెప్పింది.
తన భర్త చెన్నై సైదాపేటకు చెందిన వ్యక్తి అని, ఆయనతో తాను 15 రోజులు మాత్రమే కలిసి ఉన్నట్టుగాను, ఆ తర్వాత ఆయనకు దుబాయ్లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడని తెలిపింది. తొలుత తననూ తీసుకు వెళతానని చెప్పిన ఆయన తనను దుబాయ్కి తీసుకుపోలేదని, కొన్ని రోజుల తర్వాత ఆయన తనతో ఫోన్లో కూడా మాట్లాడడం మానేశాడని విలపించింది.
దీంతో సందేహించిన నేను సైదాపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఆయన చెన్నైకి వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయన వద్ద విచారణ జరిపారని గుర్తు చేసింది. అప్పుడు తనను కూడా దుబాయ్కి తీసుకు వెళతానని పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా తనను దుబాయ్కి తీసుకుపోలేదని తెలిపింది.
ఈ స్థితిలో ఇటీవల తన భర్త ఫేస్బుక్లో మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ఫోటోను పోస్టు చేసి ఉందని తెలిపింది. ఆ ఫోటోలో ఉన్న మహిళను తన భార్య అంటూ ఫోజు ఇచ్చినట్టు తెలిపింది. అయితే ఆ ఫోటోలో ఆయనతో ఉన్న మహిళ, ప్రముఖ సినీ సెక్సీ తార అల్ఫోన్సా అని తెలిసిందని తెలిపింది. అన్ఫోన్సా తనకు ఫోన్చేసి బెదిరిస్తోందని తెలిపింది.
ఆమె మొదట జయశంకర్ను వివాహం చేసుకుందట. కనుక ఆమెకు వదిలేసి, తాను పక్కకు తప్పుకోమంటోంది. లేకుంటే హత్య చేస్తానని బెదిరిస్తోందని విలపించింది. మా వివాహా రిసెప్షన్కు అల్ఫోన్సా వచ్చి అభినందించి వెళ్లింది. అలా చూస్తే నా కంటే ముందే ఆమె ఎలా వివాహం చేసుకుని ఉంటుంది అంటూ ప్రశ్నిస్తోంది. కనుక నటి అల్ఫోన్సా నుంచి నా భర్తను రక్షించాలి. అల్పోన్సాపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అంటూ శశికళ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కమిషనర్ జార్జ్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు అల్ఫోన్సాకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ తీయలేదు.