వినాయకుడిపై రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. వినాయకచతుర్థిని పురస్కరించుకుని వినాయకుడిపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను హైదరాబాద్లోని సరూర్ నగర్లో కేసు నమోదైంది. కరుణసాగర్ అనే లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వర్మపై 153ఏ, 505, 298, 504 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. వర్మ వినాయకుడి పుట్టుపూర్వోత్తరాలు, గణేశ్ చతుర్థి ఏ సందర్భంలో వస్తుంది..? అన్న అంశాలపై ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.