దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ మృతి... చెన్నైలో...
‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాల దర్శకుడు అయిన 72 ఏళ్ల ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు ఆయన కన్నుమూశారు. అశోక్ కుమార్ గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఉన్నారు. కాగా బుధవారం నాడు ఆయన తీవ్ర అస్వస్థకు గురయి చెన్నైలో మరణించారు. అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు అశోక్కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అభినందన’ చిత్రం మ్యూజికల్ హిట్ అయింది. అలాగే మరో చిత్రం ‘నీరాజనం’ చిత్రం కూడా మ్యూజికల్ హిట్.