దిల్ రాజుకు 'పటాస్' కాసుల వర్షం... ప్రేక్షకుల మధ్య 'పటాస్'
నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నదని మొదటి రోజు నుంచే తెలిసిపోయింది. పటాస్ మౌత్ టాక్తో పాటు రివ్యూల రేటింగ్ కూడా ఫుల్ పాజిటివ్గా ఉంది. దీంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఈ చిత్రం విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసేందుకు మంగళవారంనాడు హైదరాబాద్, సికింద్రాబాద్లో చిత్ర యూనిట్ పర్యటించింది. ముందుగా ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్కు వచ్చారు. హీరో కళ్యాణ్రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్రాజు, సాయికార్తీక్, సాయికుమార్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
కళ్యాణ్రామ్ మాట్లాడుతూ... ఆడియన్స్ ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అనిల్ రాఘవపూడి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. అలాగే దిల్రాజుగారు మాకు సపోర్ట్గా నిలిచారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.
దిల్రాజు మాట్లాడుతూ- ఈ దేవి థియేటర్లోనే నరసింహనాయుడు, ఆది విజయవంతంగా రన్ అయ్యాయి. బాలకృష్ణగారికి నరసింహనాయుడు, ఎన్టీఆర్కి ఆది చితంలా కళ్యాణ్రామ్కి పటాస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సినిమా చూసిన ప్రతి ఒకరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ- కర్ణాటకలో కూడా ఈ సినిమా సూపర్హిట్ అయింది. ఇంతకుముందు ఎన్టీఆర్గారితో మేజర్ చంద్రకాంత్, బాలకృష్ణగారితో రౌడీ ఇన్సెపెక్టర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాను. ఇప్పుడు కళ్యాణ్రామ్తో పటాస్లో నటించాను. ఇది కూడా బ్లాక్బస్టర్ హిట్ అయింది అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ- కళ్యాణ్రామ్గారు నన్ను ఒక బ్రదర్లా నమ్మి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో రూపొందింది. ఆ పెద్దాయ ఆశీస్సులతో నేను ఇండస్ట్రీకి వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఈ సినిమాతో నందమూరి అభిమానులకు మంచి ఫీస్ట్ దొరికింది. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు థాంక్స్'' అన్నారు.