ఐస్క్రీమ్ సీక్వెల్ రీ షూట్: వర్మే నా సినిమాలకు బ్రాండ్!
పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్గోపాల్ వర్మ సినిమాను రీష్యూట్ చేయాల్సివచ్చింది. అదేదో పెద్ద బేనర్, పెద్ద హీరో కాదు... ఐస్క్రీమ్ పేరుతో సీక్వెల్గా వస్తున్న రెండో భాగాన్ని ముందుగా అనుకున్నట్లుగా పూర్తిచేశారు.
అయితే అందులో ఏదో అంశాలు మిస్ అయ్యాయని భావించిన నిర్మాత ఇంకా బాగా తీయాలని చెప్పడంతో వర్మ మళ్ళీ రీష్యూట్ చేశాడు. ఈ విషయాన్ని నిర్మాత రామ సత్యనారాయణ చెబుతూ.. ఇందుకు బడ్జెట్ ఎక్కువయింది.
ముఖ్యంగా యూత్ను టార్గెట్ పెట్టుకుని సినిమా తీశాం. అని చెప్పారు. మొదటి పార్ట్ పెద్దగా ఆడకపోయినా మళ్ళీ సెకండ్ పార్ట్ తీయడానికి కారణం ఏమిటని అడిగితే... ఆడలేదని మీరంటున్నారు. నాకు మంచి లాభాలు వచ్చాయి. కలెక్షన్లు బాగున్నాయి. లేకపోతే నేనెందుకు తీస్తాను. ఇది సేఫ్గేమ్ ప్రాజెక్ట్.
గతంలో నేను తీసిన చిత్రాలు నష్టాలు చవిచూశాను. ఈ చిత్రాలు తక్కువ బడ్జెట్తో తీయడంతో నేను హాయిగా వున్నానని అంటున్నాడు. ఆ సీక్రెట్ అందరికీ చెబితే బాగుంటుంది కదా? అంటే.. అది నాదికాదు.. వర్మదే.. వర్మే నా సినిమాలకు బ్రాండ్ అంటూ చమత్కరించారు.