శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (17:12 IST)

వైభవంగా తమ్ముడి నిశితార్థం.. కన్నీరు పెట్టిన మంచు లక్ష్మి!

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తనయుడు యంగ్ హీరో మంచు మనోజ్, ప్రణతిరెడ్డి నిశ్చితార్ధం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వధించారు.  
 
ఈ వేడుక సమయంలో మంచు వారి ఆడపడుచు లక్ష్మీప్రసన్న ఆనందంతో కన్నీరు పెట్టింది. ఆమెకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. బంధాలు, అనుబంధాలను ఆమె చక్కగా పాటిస్తుంటారు. అందులోనూ తమ్ముళ్లంటే ఆమెకు ఎనలేని అభిమానం. తన తమ్ముడు మనోజ్ నిశ్చితార్థం జరుగుతుంటే.. సంతోషం పట్టలేక కన్నీరు పెట్టారట. 
 
ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైన లక్ష్మి.. తన ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయారు. ప్రణతిరెడ్డితో తన తమ్ముడి నిశ్చితార్థం చూసి ఆనందం పట్టలేక ఆమె కంట కన్నీరు ఒలికింది. 
 
ముందుగా పురోహితులు ప్రణతిరెడ్డితో గౌరీపూజ, మనోజ్తో పూజ చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. 
 
ఈ వేడుకకు వైకాపా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,  వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.