శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (16:16 IST)

శివాజీరాజా నన్ను తిట్టాడు.. పవన్ ఇంటి వద్ద కూర్చొంటా: హేమ

నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించాడని నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ దర్శకుడు దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. అలాగే, హీరో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కూడా కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతానని చెప్పారు. అయితే, తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని హేమ కామెంట్ చేశారు. 
 
తనపై వ్యక్తిగతంగా దూషణలు చేసినందుకే శివాజీ రాజాపై ఫైర్ అవ్వాల్సి వచ్చిందని హేమ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా శివాజీ రాజా నటుడు రాజేంద్రప్రసాద్‌కి మద్దతు ఇస్తున్నారు. శివాజీరాజా తనను దూషించాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి శనివారం వెళ్లిన సంగతి నిజమేనని హేమ వెల్లడించారు.