శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (15:55 IST)

మళ్లీ కలిసిన హిట్ పెయిర్.. మరో హిట్‌కు రెడీ..!

ప్రిన్స్ మహేష్ బాబు, క్రేజీ బ్యూటీ సమంతాలు జంటగా నటించిన 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలు విజయం సాధించడంతో ఈ జంటగా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత మహేష్ 'నేనొక్కడినే'  సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమా పోస్టర్‌పై సమంతా వివాదాస్పద వ్యాఖ్యలుచేసి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. 

ఈ సంఘటనతో మహేష్ కూడా మనస్తాపం చెందాడు. అప్పటి నుంచి మహేష్, సమంతలు కలిసి నటించలేదు. దీంతో వారిద్దరు ఇక కలిసి నటించేందికాదుకదా, ‌కలిసి కనిపించరు కూడా అని కోలీవుడ్ అనుకుంది. ఈ స్థితిలో గత నెలలో జరిగిన మేము సైతం వేడుకలకు వారిద్దరిని ఆహ్వానించారు. అయితే వారు అందుకు ససేమిరా అనడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఒక ప్లాన్ చేశారు.
 
ఆ ప్లాన్ ప్రకారం 'మేము సైతం' వేడుకలో మహేష్, సమంతాను కలిసి చాట్ చేసే విధంగా చేయడంతో వారి మధ్య చోటు చేసుకున్న మౌనం వీడింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ జంట వెండితెరకు రానుంది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మించే చిత్రంలోనే. ఎలాగైతేనేమి త్రివిక్రమ్ శ్రీనివాస్ విడిపోయిన హిట్ పెయిర్‌ను కలిపి, మరో హిట్టు కొట్టేందుకు సిద్ధం చేస్తున్నారనమాట.