'శ్రీమంతుడు' తర్వాత 'పార్థు'గా ప్రిన్స్..!
ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో 'శ్రీమంతుడు'. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీని తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం చేసేందుకు అంగీకరించారు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై యస్.రాధాకృష్ణ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న ఈ చిత్రాన్ని మే నెలల నుంచి సెట్ పైకి తెచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ కొత్త చిత్రానికి నిర్మాత 'పార్థు' అనే టైటిల్ను నిర్ణయించారట. ఆపేరుతో రిజిస్టర్ చేసినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్, ఇతర తారల ఎంపిక జోరుగా జరుగుతున్నట్టు సమాచారం. 'పార్థు' అనే టైటిల్ను బట్టి చూస్తే ఈ చిత్రం ఇటీవల విడుదల సూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ 'గోపాల గోపాల' తరహాలో ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.