శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (14:07 IST)

ప్రిన్స్‌ను కలవాలంటే నమ్రత పర్మిషన్ తప్పనిసరి... సెక్యూరిటీకి క్లాస్

ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పటిష్ఠ భద్రతను ఏర్పాట చేసింది. అనుమతి లేకుండా ఆయన్ను కలిసేందుకు ఎవరినీ అనుమతించరాదని ఆమె సెక్యూరిటీకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు విషయానికి వస్తే ఇటీవల మహేష్ బాబు నటించిన 'ఆగడు' చిత్రం బాక్సాఫీసు ముందు బోల్తాకొట్టడంతో నమత్రా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. 
 
మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్లపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల మహేష్ బాబుకు కథ చెప్పేందుకు నిర్మాతలు ఎప్పుడుపడితే అప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చేసేవాళ్లు అయితే ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. ఎవరైనా సరే....మహేష్ బాబును కలవాలంటే అపాయింట్‌మెంట్ పొందాల్సిందే. 
 
ఇటీవల మహేష్ బాబు.. ఓ నిర్మాత...దర్శకుడితో కలిసి కథ చెప్పేందుకు ఆయన ఇంటికి వెళ్లాడు. వాళ్లు కథ వినిపించేసి వెళ్లిపోయారు. అంతే వాళ్లు అలా వెళ్లీ వెళ్లగానే నమ్రతా శిరోద్కర్ సెక్యూరిటీ గార్డుకు క్లాస్ పీకారట. మరోసారి ఇటువంటివి రిపీట్ కావద్దొంటూ గట్టిగానే ఆదేశించినట్లు సమాచారం.