మనీషా కొయిరాలా : రెండో పెళ్లికి రెడీ అయ్యిందట!
మనీషా కొయిరాలా నేపాలీ బిజినెస్ మేన్ను పెళ్లాడింది. అయితే క్యాన్సర్, భర్తతో ఏర్పడిన విబేధాలతో అతని నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనీషా కొయిరాలా రెండో పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. అంతేగాకుండా ఓ ఆడ శిశువును దత్తత తీసుకోవడం ద్వారా ఓ మంచి పని చేయనుందని తెలిసింది.
బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లో నటించిన మనీషా కొయిరాలా.. ఏడాది క్రితం క్యాన్సర్తో బాధపడి.. చికిత్స ద్వారా కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఓ ఆడబిడ్డను దత్తత తీసుకోనుంది. అలాగే రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా మనీషా కొయిలారా రెడీ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, 44 ఏట ఉన్న తాను త్వరలో తన భాగస్వామిని ఎంచుకుంటానని.. ఈ మధ్యలో దత్తత తీసుకునే బిడ్డ సంరక్షణ కోసం పాటుపడుతానని మనీషా కొయిరాలా తెలిపింది. అందరిపట్ల ప్రేమతో ఉండే తనకు చేదు అనుభవమే మిగిలిందని ఆమె చెప్పుకొచ్చింది.
కాగా గత 2010వ సంవత్సరం నేపాల్కు చెందిన సామ్రాట్ అనే వ్యాపారవేత్తను మనువాడిన మనీషా కొయిరాల 2012లో మనస్పర్ధల కారణంగా సామ్రాట్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.