ఇండస్ట్రీని మెగా హీరోలే ఏలేస్తారా...?
ఇండస్ట్రీని మెగా హీరోలే ఏలేస్తారా? అంటే అవుననే.. సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు ఒక్కొక్కరు ప్రేక్షకుల ఆదరణకు ఆరాపడుతున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్లు ఈపాటికే చిరంజీవి పేరును నిలబెట్టేశారు. తాజాగా వారి మేనల్లుళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఒకరు దిగేశారు కూడా. అందులో సాయిధరమ్ తేజ 'పిల్లా నువ్వులేని జీవితం'తో నటుడిగా నిరూపించుకున్నాడు. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో పలు దేవాలయాలను సందర్శిస్తున్నాడు.
గతంలో 130 కేజీలు వుండేవాడిననీ, 35 కేజీలకు పైగా తగ్గాననీ చెబుతున్న సాయిధరమ్ తేజ ఇంకా స్లిమ్గా వుండటానికి ట్రై చేస్తున్నాడు. జూబ్లీహిల్స్లోని ఓ జిమ్లో కోచ్ పర్యవేక్షణలో బాడీని కష్టపెడుతున్నాడు. ఇంకోవైపు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా అక్కడే శిక్షణ పొంది తన తండ్రిలాగే తను కూడా లావు తగ్గాడు. అంతకుముందు 100 కేజీల పైనే వుండేవాడిననీ, ఇప్పుడు చాలా తగ్గాననీ చెబుతున్నాడు.
ఈయన నటించిన ముకుంద చిత్రం డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలు ఇండస్ట్రీపై పట్టు సంపాదించాలని చూస్తున్నారు. అయితే... ఇతర ఫ్యామిలీ కంటే మెగా ఫ్యామిలీ నుంచే పేరుకు తగ్గట్లు ఎక్కువమంది రావడం విశేషం.