నాగ చైతన్య సినిమాకు ''దోచేయ్'' టైటిల్ ఖరారు!
అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ను ఖరారు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ను దోచెయ్గా రిజిష్టర్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరింది. ఇందులో మోసం చేసే వారిని ఘరానా మోసంతో దెబ్బ కొట్టే యంగ్ డైనమిక్ యువకుడిగా చైతూ నటిస్తున్నాడు.
అందుకే, ఈ చిత్రానికి 'దోచెయ్' అనే టైటిల్ కరెక్టుగా సెట్ అవుతుందని నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రంలో చైతూ సరసన కృతి సనాన్ హీరోయిన్గా నటిస్తోంది.