శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:17 IST)

'ఎర్ర' కూలీలు చనిపోతే... చంద్రబాబు పక్కన వేదికపై కూర్చుంటావా... త్రిషకు వార్నింగ్స్

చెన్నై బ్యూటీ త్రిషకు కొత్త చిక్కు వచ్చిపడింది. లైన్ మూవీ ఆడియో వేడుక నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో త్రిష వేదికను పంచుకుంది. ఇప్పుడు దీనిపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వార్నింగులు కూడా ఇస్తున్నాయట. 

 
రాబోయే రోజుల్లో ఈమె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హిందూ మక్కల్ కట్చి సంఘం హెచ్చరించడంతో త్రిష అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయిన సంగతి తెలిసిందే. చనిపోయినవారు అందరూ తమిళనాడుకు చెందినవారే. ఈ నేపధ్యంలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆగ్రహం వ్యక్తమవుతోంది.