ఎర్రచందనం కేసు : నటి నీతూ అగర్వాల్కు షరతులతో కూడిన బెయిల్!
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో సినీ నటి నీతూ అగర్వాల్కు కోర్టులో ఉపశమనం లభించింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
ఎర్రచందనం అక్రమరవాణాలో గత నెలలో వైఎస్సార్సీపీ నేత, స్మగ్లర్ మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేశారు. నీతూ బ్యాంకు ఖాతాల ద్వారా నగదు కార్యకలాపాలు జరిపినట్టు మస్తాన్ ద్వారా తెలిపింది. దాంతో ఈ వ్యవహారంలో ఆమెకు కూడా సంబంధాలున్నాయని భావించిన పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా, ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసుకున్న పిటీషన్ను ఆళ్లగడ్డ కోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.