ఆగస్టు 8న వస్తున్న 'నువ్వలా.. నేనిలా' !!
ఇటీవల ఆడియో విడుదల జరుపుకున్న 'నువ్విలా.. నేనిలా' చిత్రాన్ని ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుణ్ సందేశ్-పూర్ణ జంటగా 'మేం వయసుకు వచ్చాం' ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో అమోఘ్ క్రియేషన్స్ పతాకంపై ఇందూరి రాజశేఖర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం తెలిసిందే. సాయికార్తీక్ సంగీత సారధ్యం వహించిన 'నువ్వలా..నేనిలా' చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ మార్కెట్ చేస్తోంది.
నిర్మాత ఇందూరి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. 'నువ్వలా.. నేనిలా' పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. సాయికార్తీక్ కెరీర్లో ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. అలాగే ట్రయిలర్స్కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 8న మా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్స్ను ఇష్టపడేవాళ్లందరికీ విపరీతంగా నచ్చే సినిమా 'నువ్వలా.. నేనిలా' అన్నారు.
సోనియా బిర్జి, వెన్నెల కిషోర్, సన, ధనరాజ్, ఉత్తేజ్, అరుణ్కుమార్, గిరి, అదుర్స్ రఘు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: అమోఘ్ కియేషన్స్, ఎడిటర్: శ్రవణ్, ఆర్ట్: వర్మ, మాటలు: ఉదయ్ భాగవతుల, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: విష్ణుసూర్య.జి, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: వి.యస్.జ్ఞానశేఖర్ ఎగ్జికక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకుర్తి శ్రీధర్గౌడ్, నిర్మాత: ఇందూరి రాజశేఖర్రెడ్డి, స్క్రీన్ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!!