'పాఠశాల' ప్రయాణం
కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న ఐదుగురు స్నేహితులు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళే ప్రయాణం నేపథ్యంలో 'పాఠశాల' చిత్రం రూపొందుతోంది. ఎ మూన్ వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ బేనర్పై రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నందు, సాయిరోనాక్, హమ్ద్, అనుప్రియ, శిరీష్ ప్రధాన తారాగణం. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. చిత్రం ట్రైలర్స్ను ఆవిష్కరించారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ఐదుగురు ప్రయాణంలో తామేమి నేర్చుకున్నారనేది పాఠశాల సారాంశం. రొటీన్ చిత్రాలకు భిన్నంగా వుంటుంది. అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
దర్శకుడు తెలుపుతూ.. ట్రైలర్స్, పాటలు అన్నీ అర్థవంతంగా వున్నాయి. కథ అందరికీ నచ్చేలా వుంటుంది. చదువు అనంతరం ఐదుగురు స్నేహితుల ప్రయాణంలో ఏమి నేర్చుకున్నారనేది ప్రధాన అంశం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, మాటలు: మహి వి.రాఘవ్.