శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 4 సెప్టెంబరు 2014 (18:29 IST)

'పెసరట్టు' మూవీ ప్రారంభం

నందు, నికిత నారాయన్ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పాక్డి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'పెసరట్టు'. ఈ సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ప్రారంభం అయింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శక నిర్మాత స్టీవన్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
 
ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో, హీరోయిన్ మినహా నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూలులో పూర్తి చేసి.. అక్టోబరులో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
 
నిర్మాతలు: శ్రీనివాస్ గునిసెట్టి, ఈడుపుగంటి శేషగిరి రావు, డీజీ సుకుమర్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, లైన్-ప్రొడ్యూసర్ : డీ కే. విశ్వనాథ్, మాటలు: అరిపాల సత్య ప్రసాద్, పాటలు: సుభాష్, స్టైలీస్ట్: నిహారిక కన్నన్, కో-డైరెక్టర్: -పవిత్రం మీసాల, కథ-దర్శకత్వం : కత్తి మహేష్,