మణిరత్నం సినిమాను గర్వంతో వదులుకోలేదు డేట్స్ లేకే!: పూజా హెగ్డే
‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ సినిమాలతో టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవల మణిరత్నం తన తదుపరి చిత్రంలో హీరోయిన్గా నటించమని పూజా హెగ్డేను సంప్రదించారని, మణి ఆఫర్ను ఆమె రిజెక్ట్ చేసిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓ వర్థమాన హీరోయిన్ మణిరత్నం సినిమాను రిజెక్ట్ చేయడం ఆయనను అవమానించినట్లేనని కోలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా భావించింది.
అయితే, ఈ విషయంపై పూజాహెగ్డే మీడియాకు వివరణ ఇచ్చింది. మణిరత్నం ఆఫర్ను తాను గర్వంతో వదులుకున్నానంటూ వచ్చిన వార్తలు తనను బాధించాయని ఆమె పేర్కొంది. మణిరత్నం దర్శకత్వంలో నటించడం తన కల అని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఆయన సినిమాను వదులుకున్నానని తెలిపింది.
హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మొహంజదారో' చిత్రంలో తాను హీరోయిన్గా నటిస్తున్నానని, ఈ చిత్రం కోసం తాను ఏడాది పాటు బల్క్ డేట్స్ ఇచ్చానని ఆమె తెలిపింది. డేట్స్ అందుబాటులో లేని కారణంగానే తాను మణిరత్నం చిత్రాన్ని వదులుకున్నానని ఆమె పేర్కొంది.