మెగా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ.. వరుణ్ సరసకు రెడీ..!
టాలీవుడ్లో బాలీవుడ్ భామల ఊపు పెరిగింది. 'మిర్చి లాంటి కుర్రోడు' సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన బాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్. తాజాగా అమ్మడు మరో తెలుగు సినిమాలో నటించే ఛాన్స్ను పొందింది. వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని ప్రగ్యా సొంతం చేసుకుంది.
మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు వచ్చిన కొత్త హీరో వరుణ్ తేజ్. ఈ యంగ్ హీరో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే పిరీడ్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రంలోని కథానాయిక పాత్రకు ప్రగ్యాను తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేస్తూ, "అవును, ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నాను. ఇంతటి భారీ ప్రాజక్టులో భాగమవుతున్నందుకు చాలా ఎగ్జయిట్ అవుతున్నాను" అంటోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాదులో ఆరంభంకానున్నట్టు సమాచారం.