శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (09:27 IST)

రకుల్‌కు అర కోటి... ఎన్టీఆర్ సరసన నటించేందుకే..!

చిత్ర సీమలో ఒక్క హిట్టు కొడితే పారితోషికాన్ని అమాంతం పెంచేయడం అలవాటే. ఇప్పుడీ కోవలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. ఇన్ని రోజులు పాతిక, ముప్పై లక్షలు అంటూ తీసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటోందని సమాచారం. ఈ అమ్మడు ఎన్టీఆర్ సరసన నటిస్తున్న సినిమాకి అర కోటి డిమాండ్ చేసిందట. 
 
ఈ బ్యూటీకి అభిమానుల్లో క్రేజ్ బాగానే ఉండడంతో దర్శకత నిర్మాతలు ఓకే చెప్పినట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ గుమ్మ ఊప చూస్తుంటే త్వరలోనే కోటికి చేరుకునేట్టు కనిపిస్తుందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.