గ్లామర్ పాత్రలు వేసినా కష్టాలు తప్పలేదు: రమ్యశ్రీ
''సినిమా తియ్యడం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఒక జీవితం గురించి చూపించడం జరిగింది. ఈ సినిమా తియ్యడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఎన్నో గ్లామర్ పాత్రలు చేస్తూ పీక్లో వున్న నేను ఈ సినిమా కోసం వాటన్నింటినీ వదులుకొని రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాను.
నాకు తెలిసిన సినిమావాళ్ళే హెల్ప్ చేస్తారనుకున్నా. పైకి మాత్రం బాగానే మాట్లాడేవారు. కానీ ఎందుకనో ఆ తర్వాత హెల్ప్ గురించి సరిగ్గా ప్రోత్సాహంలేదు. మా బ్రదర్ని రిక్వెస్ట్ చేసి ఈ సినిమాని చేశాను. ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి నాకు వుంది. దానికి మీ అందరి సపోర్ట్ కూడా వుంటుందని ఆశిస్తున్నాను'' అని రమ్యశ్రీ చెప్పారు.
ఆర్.ఎ. ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బి.ప్రశాంత్ నిర్మాతగా రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. త్వరలో సినిమాను విడుదల చేస్తానని తెలియజేసింది.