రెజినా 'నిర్ణయం' అదే
రెజీనా కథానాయికగా రూపొందిన తమిళ చిత్రం 'నిర్ణయం'. రాణా విక్రమ్ కథానాయకుడు. శరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం అదే టైటిల్తో లావా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె. జోత్స్నరాణి, ఎం. లక్ష్మీ, సురేఖ తెలుగులో అనువదిస్తున్నారు.
డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.... ఓ పెద్ద కుటుంబానికి చెందిన అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఇంటి నుండి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేది కథ. చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. బేబి వేదిక కీలకపాత్ర పోషించింది.
సెల్వ గణేష్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 5న విడుదల చేస్తున్నాం' అన్నారు. శరణ్య, బేబి వేదిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, పాటలు: మహేష్ అల్లు, కెమెరా: చిట్టిబాబు.