రుద్రమదేవి డైలాగ్లు కాంట్రవర్సీనా... కేసీఆర్కు కోపం వచ్చిందా...?!!
గుణశేఖర్ రుద్రమదేవి చిత్రాన్ని తీస్తున్నాడు. అయితే ఇందులో డైలాగ్లు కొందరికి ఇబ్బంది పెట్టేవిగా సినిమాటిక్గా వున్నాయనే విమర్శలు వసుతన్నాయి. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే మార్కెట్లో విడుదల అయ్యింది. ఇందులోని డైలాగ్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
'ఒకే తల్లిపాలు తాగేవారు అన్నదమ్ములు అయినప్పుడు, ఒకే నీళ్ళు తాగేవారు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు కాలేమా' అనే డైలాగ్ కెసిఆర్కు రుచించడం లేదని, దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇటువంటి వ్యాఖ్యలు ఉండటం సరికాదని ఆయన తెలిపినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను తెలంగాణలోని వరంగల్లో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో విడుదల చేయాలనీ, ఈ వేడుకకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వేడుకలో ఎటువంటి వ్యాఖ్యానాలైనా ఆయన తరఫున చేస్తారేమోనని ఫిలింనగర్లో వార్తలు విన్పిస్తున్నాయి.