శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (14:07 IST)

శ్రీదేవి పాత్రలో శృతిహాసన్.. "ఎర్రగులాబీలు" చిత్రంలో...

అలనాటి నటి శ్రీదేవి పాత్రలో చెన్నై చిన్నది శృతిహాసన్ కనిపించనుంది. 1978 సంవత్సరంలో తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి శ్రీదేవి "సిగప్పు రోజాక్కళ్" (తెలుగు చిత్రం ఎర్రగులాబీలు)అనే తమిళ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలోనే రీమేక్ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి హీరోగా నటించే ఈ చిత్రంలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 
 
1978లో తెలుగు, తమిళ భాషల్లో మంచి హిట్ సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు భారతీరాజా తీశారు. ప్రస్తుతం ఇదే ఇత్రాన్ని ఈయన తనయుడు మనోజ్ భారతి రీమేక్ చేస్తుండగా, ఇందులో శ్రీదేవి పాత్రను శృతి హాసన్ పోషిస్తుందట. నాడు ఓ సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇపుడు ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.