శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2015 (20:38 IST)

'బ్రహ్మోత్సవం'లో నటించడం లేదు.. అవన్నీ ఒట్టి పుకార్లే.. సునీత స్పష్టం..!

ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ఈ చిత్రంలో ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో సునీతను నటింపజేయాలని మహేష్ బాబు స్వయంగా కోరారని, దీంతో ఆమె మహేష్ బాబుకు వదిగా నటించేందుకు అంగీకరించారంటూ వార్తలు వెల్లువెత్తాయి. 
 
ఈ వార్తలపై సినీత స్పందించారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేశారు. తాజాగా సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం'లో నటిస్తున్నానని అభినందిస్తూ ఫోన్లూ, మెసేజ్ లు వస్తున్నాయన్నారు. అయితే తాను నటిస్తున్నట్లు వచ్చిన ఆ వార్త నిజం కాదన్నారు. ఆ పాత్రకు నేనైతే బాగుంటుందని చిత్ర యూనిట్‌లో అనుకొని ఉంటారని, ఇంతలో ఆ వార్త అలా బయటకు వచ్చి ఉంటుందని తెలిపారు
 
అంతేకాకుండా జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో, ఏ టైమ్‌కి ఏమవుతుందో ఎవరు చెప్ప గలరు, సంగీత ప్రధానమైన కథతో, ఆఫ్‌బీట్ సినిమా ఆఫర్‌ వస్తే నటిస్తానేమో అని అన్నారు. కాగా ఈ సినిమాలో సునీత తన పాత్ర నచ్చకనే రిజక్ట్ చేసినట్లు సమాచారం. నటన పరంగా తన ఎంట్రీ ఇలా వదిన పాత్రలో సాదా సీదాగా కాకుండా డిఫరెంటుగా ఉండాలని ఆమె భావిస్తోందని, అందుకే ఆమె ఈ ఆఫర్ రిజక్ట్ చేసినట్లు టాలీవుడ్ టాక్.