శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (14:12 IST)

విజయవాడలో పాప్ గాయని స్మిత పెడుతున్న విదేశీ ఫుడ్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి దగ్గరలో వున్న విజయవాడ సిటీ ఎంతో అభివృద్ధి వైపు నడుస్తోంది. ముందుముందు ఇక్కడకు వివిధ పనుల కోసం వ్యాపారాల కోసం దేశవిదేశాల నుంచి అతిథులు వస్తారు. వారి సౌకర్యార్థం వివిధ వంటకాలు, స్నాక్స్‌ వంటివి దొరికేందుకు 'టిఎల్‌ఎఫ్‌' ఫుడ్‌ కోర్టు ఉపయోగపడుతుందని పాప్‌ సింగర్‌, నటి స్మిత చెబుతోంది.

 
బుధవారం నాడు ఆమె విజయవాడలోని మొగల్‌రాజపురంలో హోటల్‌ను ఆమె లాంఛ్‌ చేశారు. స్మిత బాల్య స్నేహితులు వినోద్‌, కృష్ణ చైతన్యలు నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ అధునాతన సౌకర్యాలతో వుంటుందని వారు పేర్కొన్నారు. కాఫీ, టీల నుంచి భోజనం వరకు వివిధ దేశవిదేశీ వంటకాలు కూడా లభ్యమవుతాయనీ, లండన్‌లో పేరు పొంది హైదరాబాద్‌లో తన సేవలను అందిస్తున్న సాహిల్‌ తన  బృందంతో ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు.