బాలయ్యతో స్టెప్పులేసిన త్రిష.. 'హైసా అంబానీ పిల్లా ...' అంటూ..
లెజండ్' సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తాజాగా ఒక పాటను చిత్రీకరించారు.
'హైసా అంబానీ పిల్లా ...' అంటూ సాగే ఈ పాటను బాలయ్య, త్రిష జంటపై రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేశారు. దీనికి నోబుల్ కోరియోగ్రఫీ నిర్వహించాడు.
నాయకుడంటే ఇలా వుండాలని తెలియజెప్పే పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారని దర్శకుడు సత్యదేవా తెలిపాడు. గతంలో బాలయ్యకు పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.