శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:09 IST)

సుకుమార్ ప్రేమకథా చిత్రం... షీనాబజాజ్ హీరోయిన్‌గా..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా అవతారమెత్తనున్నాడు. తొలి ప్రయత్నంగా ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు చేస్తున్నారు. పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కరెంట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తాడు. 
 
ఈ సందర్భంగా సహ నిర్మాతలు మాట్లాడుతూ- సుకుమార్ చిత్రాల తరహాలో వైవిధ్యంగా కొనసాగే ఈ అందమైన ప్రేమకథా చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ ఫేమ్ రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా షీనాబజాజ్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. నవంబర్ 9 నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. 
 
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి పనిచేయనున్నారు. మగధీర, అత్తారింటికి దారేది వంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవీంద్ర ఈ చిత్రానికి పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.