శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 27 జనవరి 2015 (16:00 IST)

ప్లాప్‌ హీరోహీరోయిన్లు ప్లస్‌ అవుతారా...?

మైనస్‌ మైనస్ ప్లస్‌ అవుతారని.. గతంలో గబ్బర్‌ సింగ్‌ సమయంలో నిర్మాత చెప్పేవాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితే అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. చాలాకాలం నుంచి నటుడు సుమంత్‌కు అవకాశాలు లేవు. ఉన్నా హిట్‌ కాలేకపోతున్నాయి. ఇప్పుడు అతన్ని హీరోగా పెట్టి దర్శకుడు శివనాగేశ్వరరావు ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు.
 
సుమంత్ సరసన ఎవరిని ఎంచుకోవాలనే తర్జనభర్జన పడ్డాక.. ఆఖరికి.. సుష్మారాజ్‌ను ఎంపిక చేశారు. తెలుగులో నీలకంఠ చిత్రంలో మాయ, సందీప్‌ కిషన్‌తో జోరు చిత్రాల్లో చేసింది. రెండూ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మూడో చిత్రంలో ఆమెను తీసుకుంటే సక్సెస్‌ అవుతుందనుకున్నాడో ఏమో... కాంబినేషన్‌ సెట్‌ చేసి త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నాడు.
 
కాగా, అప్పటికే ఓ తమిళ సినిమాలో నటించిన సుష్మాకు అక్కడ ఒక్క విజయం దక్కింది. ఇక శివనాగేశ్వరరావు తన చిత్రం గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తానని ప్రకటించాడు.