నాగ్ మల్టీస్టారర్.... తప్పుకున్న శ్రుతి.. తమన్నా రీప్లేస్..!
ప్రముఖ నటి శ్రుతి హాసన్ స్థానంలోకి తమన్నా రానుంది. పీవీపీ సంస్థ నిర్మాణంలో నాగార్జున, కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంలో కథానాయికగా శ్రుతిని ఎంచుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆమె అందులో నుంచి తప్పుకోవడం, ఈ వ్యవహారం కోర్టుకి వెళ్లడం మనకు తెలిసిందే.
తాజాగా వార్త ఏంటంటే.. శ్రుతి స్థానంలో తమన్నాను తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా నాగ్ సూచన మేరకు తమన్నను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రస్తుతం తమన్నాతో చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్ టాక్.