శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2014 (11:55 IST)

ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్!

ఇద్దరు హీరోలు నాగ్, కార్తీతో తమన్నా రొమాన్స్ చేయనుంది. సీనియర్ హీరో నాగార్జునతో పాటు యంగ్ హీరో ఆవారా యాక్టర్ కార్తీతో కలసి తమన్నా నటించనుంది. నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించనున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుందని సమాచారం. 
 
నాగార్జున, కార్తీలు ఈ చిత్రంలో ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నారని.. ఈ ఛాన్స్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా కార్తీతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. తమిళంలో రూపొందిన 'పయ్యా'(తెలుగులో ఆవారా), 'సిరుత్తై'(తెలుగు విక్రమార్కుడికి రీమేక్) చిత్రాల్లో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక నాగార్జునతో తొలిసారి తమన్నా రొమాన్స్ చేయనుంది. దీంతో ఇన్నాళ్ళు తమన్నాతో రొమాన్స్ చేయాలని కలగన్న నాగ్ ఆశ నెరవేరనుంది. 
 
గతంలో తమన్నాతో సినిమా చేయాలని నాగార్జున ఉవ్విళ్లూరాడని వార్తలొచ్చాయి. అయితే తమన్నా నాగ్ సీనియర్ కావడంతో అంగీకరించలేదని.. ప్రస్తుతం మల్టీస్టారర్ కావడంతో నాగ్‌తో జతకట్టేందుకు మిల్కీ బ్యూటీ ఓకే చెప్పేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకా యంగ్ హీరో కార్తీ ఉన్నాడనే ధైర్యంతోనే నాగ్‌తో చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.