బాలీవుడ్ బ్యూటీకి మరో భారీ ఆఫర్... బన్నీ సరసకు సయేశా రెడీ..!
ఇటీవల కాలంలో టాలీవుడ్లోకి బాలీవుడ్ భామల రాక ఎక్కువవుతోంది. తాజాగా వి.వి.వినాయక దర్శకత్వంలో అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో బాలీవుడ్ భామ సయేశ హీరోయిన్గా ఎంపిక అయ్యింది.
ఇది అమ్మడుకి తెలుగులో తొలి సినిమానే. ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు. అప్పుడే అమ్మడుకి మరో భారీ ఆఫర్ వచ్చింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా సయేశా సైగల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం దానికి సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుందని టాలీవుడ్ టాక్.