వడ చెన్నై: వీఐపీ ధనుష్తో సమంత రెండోసారి రొమాన్స్!
బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా ''మారి''. ఈ సినిమాకు రాధికా శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మాణ సారథ్యం వహించారు. అనిరుద్ సంగీత సమకూర్చాడు. ఈ సినిమా రిలీజ్కు తర్వాత వేల్ రాజ్ నిర్మాణ సారథ్యంలో విఐపీ 2 సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ గ్యాప్లో ప్రభు సాల్మన్ నిర్మాణంలో ధనుష్ నటించనున్నట్లు ముందే ప్రకటన వచ్చింది.
అయినప్పటికీ మణిరత్నం సినిమాలో బక్కహీరో ధనుష్ నటించనున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే అధికారిక వర్గాల ప్రకారం ప్రభు సాల్మన్ చిత్రంలోనే ధనుష్ నటిస్తున్నట్లు తెలిసింది. కానీ ధనుష్ మాత్రం ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఆసక్తికర అంశాలను పోస్ట్ చేశాడు.
వీఐపీకి తర్వాత వడ చెన్నై చిత్రంలో నటించనున్నట్లు చెప్పాడు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబరులో ప్రారంభం కానుందని తెలిపాడు. ఇందులో సమంత తనకు హీరోయిన్గా రెండోసారి నటించనున్నారు. 2016లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ధనుష్ ట్వీట్ చేశాడు.