శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2020 (11:30 IST)

ఆఫర్ ఇవ్వాలేగానీ ఆ పని కూడా చేస్తానంటున్న హీరోయిన్!!

గతంలో వచ్చిన 'మజ్ను' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన భామ అను ఎమాన్యూల్. ఈ చిత్రం తర్వాత అనేక మందిస్టార్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులను ఈ భామ దక్కించుకుంది. 
 
ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించింది. కానీ, ఈ అమ్మడు అదృష్టమో.. దురదృష్టమో ఏమోగానీ, ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఆ తర్వాత ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఒకటి అరా చిత్రాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. 
 
అయితే, తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం అను ఎమాన్యూల్ ఆఫర్ల కోసం ఆరాట పడుతుంది. అందం అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంది. దీంతో తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. 
 
ఇకచేసేదేంలేక... అందరిలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిపోయింది. హీట్ పెంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తూ వస్తోంది. ఆఫర్ల కోసం తన రెమ్యునరేష‌న్‌ను కూడా తగించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.40 - 45 లక్షలకే అను సినిమాలు ఒప్పుకోవడానికి రెడీగా ఉందన్న టాక్ వినిపిస్తోంది.