'లింగా'లో వాడిపోయిన అనుష్క... లెక్చర్లిస్తోంది అందుకేనా...?!!
ఇటీవల టాప్ రేటులో వున్న నటి అనుష్క... రుద్రమదేవి, బాహుబలి వంటి పెద్ద చిత్రాల్లో నటించిన ఆమె, సూపర్స్టార్ రజనీకాంత్తో నటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఐతే పెద్ద హీరోలతో ఆమె నటించడం కూడా పెద్ద భారంగా మారింది. అనుష్క వుంటే చాలు.. తాము రెడీ అంటూ తెలుగులో ప్రముఖ హీరోలు, దర్శకులకు చెబుతున్నారు. అంటే ఆమె రేంజ్ ఎలా పెరిగిందో చూడండి.
ఏదిఏమైనా.. నటన అనేది అప్పటికీఇప్పటికి చాలా మారిందంటూ చెపుతున్న అనుష్క ఇంకా మాట్లాడుతూ... గతంలో టెక్నాలజీ లేనప్పుడే కేవలం సినిమా అనేది వుండేది. దాని ద్వారా పేరు వచ్చేది. ఇప్పుడు ఫేస్బుక్, వాట్సప్, ట్విట్లర్లు వచ్చాక.. ఎప్పుడూ వారికి కన్పిస్తేనే ఇంకా లైమ్లైట్లో వుందనుకుంటారు. లేదంటే.. ఏదోదే రాసేస్తుంటారు. కొన్నాళ్ళకు మర్చిపోతారు. అందుకే పదికాలాల పాటు గుర్తుండాలంటే బాగా ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం వుంద"ని చెబుతోంది.
ఇపుడీ లెక్చర్ ఇవ్వడానికి కారణం ఏంటయా అని ఆరా తీస్తున్న కొందరికి... లింగాలో అనుష్క గ్లామర్ వాడిపోయి కనబడటమే అంటున్నారు. నిజమేనంటారా...?!!