శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:11 IST)

దేశంలో బాహుబలి మానియా.. ఒక్క టికెట్టు ఇప్పించండి బాబూ.. పొలిటికల్ లీడర్స్‌పై ఒత్తిడి..

'సార్‌.. ఒక్క టిక్కెట్‌.. ఒకే ఒక్క టికెట్‌.. పొద్దున 7 గంటల ఆటకే అక్కర్లేదు.. నూన్‌షోకి ఇప్పించినా ఫర్వాలేదు. మ్యాట్నీ అయినా సరే..' ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బాహుబలి మానియా. ప్లీజ్.. ఒక్క టిక్కెట

'సార్‌.. ఒక్క టిక్కెట్‌.. ఒకే ఒక్క టికెట్‌.. పొద్దున 7 గంటల ఆటకే అక్కర్లేదు.. నూన్‌షోకి ఇప్పించినా ఫర్వాలేదు. మ్యాట్నీ అయినా సరే..' ఇది దేశవ్యాప్తంగా కొనసాగుతున్న బాహుబలి మానియా. ప్లీజ్.. ఒక్క టిక్కెట్ ఇప్పించండి బాబూ అంటూ రాజకీయ నేతలకు ఒత్తిళ్లు మామూలూ రేంజ్‌లో లేవు. దీంతో రాజకీయ నేతలు తమ మొబైల్ ఫోన్స్ సైతం స్విచాఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఇతర రాష్ట్రాల సంగతి అంటుంచితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బాహుబలి చిత్రాన్ని తొలి ఆటనే చూడాలన్న ఆతృత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీంతో... తమకు తెలిసిన వారి ద్వారా టిక్కెట్ల కోసం పైరవీలు చేస్తున్నారు. ఎలాగైనా ఒక్క టిక్కెట్టైనా సంపాదించే పనిలో ఉన్నారు. ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు బ్లాక్‌మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. ఒక్కో టికెట్‌నూ రూ.500 నుంచి రూ.1000 దాకా అమ్ముతున్నారు. మరోవైపు అభిమానులు కొన్ని చోట్ల బ్లాకులో ఒక్కో టికెట్‌ రూ.2000కు కూడా కొన్నారంటే అతిశయోక్తి కాదు.