అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంగా దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ను చేపట్టడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ నెల 20 నాటికి ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవలే తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో అట్లీ, సన్ పిక్చర్స్తో డీల్ కుదుర్చుకోనున్నాడు. ఈ చిత్రం రైన్ జానా ఇతివృత్తంతో ఉంటుందని టాక్.
అట్లీ స్క్రిప్ట్ ప్రకారం, ఈ చిత్రానికి ఐదుగురు హీరోయిన్లు అవసరం. వారిలో ఎక్కువ మంది విదేశీ నటీమణులు ఉంటారు. అట్లీ మూడు ప్రధాన పాత్రల కోసం అమెరికన్, కొరియన్, ఇతర భాషా నటీమణులను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. జాన్వీ కపూర్ను ఇందులో ప్రధాన మహిళా కథానాయికగా తీసుకోనున్నారు. ఇందులో మరో భారతీయ నటికి ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.