శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2016 (17:12 IST)

కృష్ణవంశీకి చుక్కలు చూపించి టాలీవుడ్ హీరోయిన్.. సారీ చెప్పిన దర్శకుడు!

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఆరాటపడుతుంటారు. తమకెప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటార

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఆరాటపడుతుంటారు. తమకెప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదేసమయంలో టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా చుక్కలు చూపించే డైరెక్టర్ ఉన్నారంటే అది ఒక్క కృష్ణవంశీ మాత్రమే అని ఠక్కున చెపుతారు. ఎందుకంటే కృష్ణవంశీ ఏ విషయంలో రాజీ పడే డైరక్టర్ కాదు. తనతో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మినహాయించి... ఇతరులు కృష్ణవంశీ‌తో మాట్లాడే సాహసం చేయరు. 
 
అలాంటి కృష్ణవంశీకే టాలీవుడ్ హీరోయిన్ రెజీనా చుక్కలు చూపించారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' సినిమాలో రెజీనా నటిస్తోంది. ఆమెతోపాటు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. డిసెంబర్ 13న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని నక్షత్రం సినిమా యూనిట్ ఒక ట్రైలర్ విడుదల చేసింది. అయితే పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేయాల్సిందని, అయితే చేయలేకపోయామని, ఆలస్యమైనందుకు, ట్రైలర్‌లో పుట్టిన రోజు డేట్‌ను ప్రస్తావించనందుకు క్షమించాలని ఆయన కోరారు.