''అభిమన్యు''గా వస్తున్న మహేష్ బాబు.. మురుగదాస్ సినిమా టైటిల్ అదేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది.
ఈ సినిమా న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే ఈ మూవీకి టైటిల్స్ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. మొదట ఎనిమీ అని, ఆ తరువాత వాస్కోడగామా అని, అనంతరం చట్టంతో పోరాటం అని.. ఇలా రకరకాల టైటిల్స్ వినిపించాయి. వీటికి మహేష్, మురుగదాస్ నో చెప్పారట. దీంతో తాజాగా ''అభిమన్యు'' అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టు ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటనేదీ రాకపోయినా ఈ టైటిల్ బాగానే ఉందని మహేష్, మురుగదాస్ అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఈ సినిమాకు హారిష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ తొలిసారి కావడంతో పాటు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.