మంచు లక్ష్మి వైవిద్యమైన పాత్రల్లో నటిస్తూ, మరోవైపు బుల్లితెర రియాలిటీ షోలు చేస్తూ రెండు చేతులా డబ్బు సంపాదిస్తోంది. అయితే తాజాగా కింగ్ నాగార్జున, మంచు లక్ష్మీకి ఝలకిచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా లక్ష్మి మాటీవీలో ''దూసుకెళ్తా'' అనే రియాలిటీ షోని చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆ షోను నాగ్ మధ్యలో నిలిపివేశాడట. దాని స్థానంలో తాను నిర్వహిస్తోన్న '' మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ని ప్రశారం చేయనున్నారట. దీంతో లక్ష్మీ ఆదాయానికి గండిపడినట్లు అయింది.
కింగ్ నాగార్జున హోస్ట్గా ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ కన్నా లక్ష్మీ షోకే ఎక్కువ రేటింగ్స్ వస్తాయనే ఉద్దేశంతో నాగ్ కావాలనే ఈ షోకి ఫుల్స్టాప్ పెట్టించినట్లు టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. అసలు 'దూసుకెళ్తా' షో టైమ్లోనే ఈ షోని ప్రసారం చేయాలనే నిర్ణయం వెనుక కారణం కూడా అదేనంటున్నారు. మరి అసలు ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.