1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:36 IST)

ప్చ్.. చెల్లిగా నటించాలా? డైలామాలో పడిన నివేదా థామస్?

టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా నిర్మించనున్న ఈ చిత్రంలో నటించే నటీనటుల పేర్లు వెల్లడికావాల్సివుంది. 
 
అయితే, ఈ చిత్రానికంటే ముందు వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రంలో సెకండ్ కథాయికకు కూడా స్కోప్ ఉందనీ, ఆ పాత్రకు నివేదా థామస్‌ను ఎంపిక చేశారనే వార్తలు హల్చల్ చేశాయి. 
 
అయితే, ఇపుడు ఈ వార్తలు మరోలా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నివేథాని అడిగింది సెకండ్ హీరోయిన్‌గా నటించడానికి కాదంట. ప్రభాస్ సోదరిగా నటించడానికి అడిగారట. అయితే నివేథా ముందు ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించినా, సోదరిగా అనేసరికి మళ్లీ ఆలోచనలో పడిందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అలాగే నివేథా థామస్ కూడా ఇప్పటివరకు ఈ విషయంపై మాట్లాడలేదు. ఏ విషయం చిత్రయూనిట్ తెలపాల్సి ఉంది.
 
కాగా, ప్రభాస్ "బాహుబలి" సీక్వెల్ చిత్రాల తర్వాత నటించిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో తన తదుపరి చిత్రంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'రాధేశ్యామ్' చిత్రం పూర్తవగానే.. నాగ్ అశ్విన్‌తో తన 21వ చిత్రాన్ని (వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించే చిత్రం), ఓం రౌత్‌తో తన 22వ చిత్రం 'ఆదిపురుష్'ని ప్రభాస్ సెట్‌పైకి తీసుకెళ్లనున్నారు.