రామ్ చరణ్ ధృవ ఆడియోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...?
చెర్రీ-రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న మూవీ ధృవ. తమిళ్ మూవీ తని ఒరువన్కి రీమేక్గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఒరిజినల్కి స్కోర్ చేసిన జంట మ్యూజిక్ డైరెక్టర్లు హిప్ హాప్ తమిళనే పట్ట
చెర్రీ-రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న మూవీ ధృవ. తమిళ్ మూవీ తని ఒరువన్కి రీమేక్గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఒరిజినల్కి స్కోర్ చేసిన జంట మ్యూజిక్ డైరెక్టర్లు హిప్ హాప్ తమిళనే పట్టుకొచ్చారు. ఇప్పుడీ సంగీత దర్శక ద్వయం.. ధృవకి అదిరిపోయే ఆడియో ఇచ్చినట్లు సమాచారం.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆడియో వేడుకకు రావాల్సిందిగా పవన్ని ఇన్వైట్ చేశారట. నవంబర్ 20న జరిగే ఈవెంట్కి వచ్చేందుకు పవన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. అదే వేదికపై ఇతర మెగా హీరోలు దర్శనమివ్వనున్నారు. అబ్బాయ్ ఆడియో వేడుకలో బాబాయ్ మెరవనున్నారన్నది ప్రస్తుతం అభిమానుల చెవికి ఎంతో ఇంపైన మాట. ధృవ ఆడియోకి పవర్స్టార్తో పాటు ఇతర మెగా హీరోలు ఎటెండ్ కానున్నారుట.
ఇక సినిమాను డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో టీమ్ ఉందని తెలిసింది. ఇప్పటికే ఒక్క పాట మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్న ఈ మూవీకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన టీజర్, ఫస్ట్లుక్ అందరినీ ఆకట్టుకోగా దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.