అవకాశం ఇస్తానని ఆమెను అక్కడే పెట్టుకున్నాడట పూరీ
పూరీ జగన్నాథ్ కొత్త అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తుంటాడు. బిజినెస్మన్లో చిన్న పాత్ర వేసిన తేజస్విని ఆ తర్వాత మంచి సినిమా ఇస్తానని తన వద్దే పెట్టుకున్నట్లు ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. కొత్తగా ఎన్టిఆర్తో తీయబోయే చిత్రానికి సంబంధించిన కథా చర్చల్లో ఆయన నిమగ్నమై వున్నాడు. తరచూ కథల కోసం బ్యాంకాక్ వెళ్ళే పూరీ ఈసారి మాత్రం జూబ్లీహిల్స్లోని ఓ హోటల్లోనే కథాచర్చలు జరుపుతున్నాడు. అక్కడే మ్యూజిక్ సిట్టింగ్స్కూడా.
తేజస్వి కూడా పూరీతో చర్చల్లో పాల్గొందని తెలుస్తోంది. పూరీ చిత్రం ఆలస్యం కావడంతో... ఆయన రామ్గోపాల్వర్మ చేస్తున్న ఐస్క్రీమ్కు రికమండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐస్క్రీమ్-2 సినిమా కూడా తయారవుతుంది. మొదటి పార్ట్లో నగ్నంగా నటించానని ఏదో స్టేట్మెంట్ ఇచ్చి... ప్రేక్షకుల బలహీనతలను ఆకట్టుకున్న ఈ భామ... ఈసారి టబ్లో స్నానం చేస్తూ రెండు కాళ్లను పైకెత్తే పోస్టర్ను వర్మ పబ్లిసిటీకి ఉపయోగించుకున్నాడు. మరి ఈ అమ్మడు ఇద్దరు పెద్ద దర్శకుల అండతో ఇండస్ట్రీలో దూసుకుపోతుందో లేదో చూడాలి.