శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 ఆగస్టు 2014 (12:40 IST)

మళ్ళీ 'ఎవడు' జోడీ... శ్రుతి హాసన్ కు లక్కీ చాన్స్

రామ్‌ చరణ్ సరసన కాజల్‌ హిట్‌ పెయిర్‌గా వుంది. అయితే గబ్బర్‌ సింగ్‌తో గోల్డెన్‌ లెగ్‌గా మారిన శ్రుతి హాసన్‌తో.. రామ్‌చరణ్‌ జోడీ కట్టి 'ఎవడు'లో అలరించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
దానయ్య నిర్మాత. ఇప్పటికే దానయ్య కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రామ్‌ చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రముఖ రచయితలు కూడా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారని తెలుస్తోంది.