1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:59 IST)

ఏ హీరోలంటే ఇష్టమంటే.. పవన్, మహేశ్, ఎన్టీఆర్, విక్రమ్, సూర్య.. ఇంకా : రెజీనా ఆన్సర్

చెన్నై బ్యూటీ 'రెజీనా' వరుస సినిమాలతో పుల్ బిజీ అయిపోయింది. సక్సెస్‌లు లేవు కానీ కొత్త అవకాశాలు మాత్రం కొకొల్లలుగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు ఏకకాలంలో షూటింగ్

చెన్నై బ్యూటీ 'రెజీనా' వరుస సినిమాలతో పుల్ బిజీ అయిపోయింది. సక్సెస్‌లు లేవు కానీ కొత్త అవకాశాలు మాత్రం కొకొల్లలుగా వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న నాలుగు కొత్త సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందుకే సక్సెస్‌లు లేకపోయిన వరుసగా సినిమాలు చేయడంతో ఈ అమ్మడు తన రెమ్యూనేషన్‌ను పెంచింది. 
 
'కృష్ణవంశీ' 'నక్షత్రం' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ 'అవసరాల శ్రీనివాస్' దర్శకత్వం వహించి 'జ్యో అచ్యుతానంద' మూవీలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలైంది. ఇక తమిళంలోనూ 'మానగరం' అనే సినిమా చేస్తోంది. తాజాగా ఈ భామ బాలీవుడ్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. 2002లో వచ్చిన 'ఆంఖేన్' మూవీకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది. ఈ సీక్వెల్ 'రెజీనా' హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. 
 
మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, సుస్మితా సేన్ ప్రధానమైన పాత్రల్లో నటించారు. ఇదిలావుంటే ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన కథానాయకులు ఎవరు?.. ఎవరితో కలిసి నటించాలని ఉందనే ప్రశ్నకు.. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, విక్రమ్, సూర్య నటన అంటే తనకి ఎంతో ఇష్టమనీ, వాళ్లతో కలిసి నటించాలని ఉందని చెప్పింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కథానాయకులంతా ఇష్టమేనని చాలామంది హీరోయిన్లు అంటుంటారు. కానీ వరుసగా పేర్లు చెబుతూ రెజీనా అందరికి షాక్ ఇచ్చింది.