శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By CVR
Last Updated : గురువారం, 30 జులై 2015 (16:47 IST)

అతిథి పాత్రలో సమంత... గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా?

ఇటీవల మలయాళంలో హిట్టు కొట్టిన చిత్రాలను పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆ మధ్య మలయాళంలో హిట్టుకొట్టిన 'దృశ్యం' చిత్రం తర్వాత తెలుగు, తమిళం భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. ఈ విషయం పక్కనపెడితే... ఇదే విధంగా మలయాళంలో ఘన విజయం సాధించిన మరో చిత్రం 'బెంగుళూర్ డేస్'
 
ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో 'అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీదివ్య, పార్వతీ మీనన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారి వరుసలో తాజాగా సమంత పేరు కూడా చేరినట్టు సమాచారం. మలయాళ మాతృకలో నిత్యామీనన్ పోషించిన అతిథి పాత్రలో సమంతా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న మలయాళంలో అతిథి పాత్రలో నటిస్తుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. దీంతో బెంగుళూర్ డేస్‌లో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనే విషయపై స్పష్టత రావాల్సి ఉంది.