గోపీచంద్తో ఐటెం సాంగ్కు ఒకే చెప్పిన మిల్కీ ...
గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్నంది ఓ మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్కు జోడీగా హన్సిక, కేథరిన్ హీరోయిన్ల
గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్నంది ఓ మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్కు జోడీగా హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు ఓ ప్రత్యేక గీతంలో మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కనిపించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ''బాహుబలి ది కంక్లూజన్'', ''అభినేత్రి'' వంటి చిత్రాలతో పాటు తమిళంలో విజయ్సేతుపతితో ''ధర్మదొరై'', విశాల్ నటిస్తున్న ''కత్తి సండై'' చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది. తమన్నా సినిమాలో నటించినా, ప్రత్యేకమైన పాటలో నృత్యం చేసిన సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో ఉంది.
అదే సెంటిమెంట్తో గోపీచంద్తో తమన్నా ప్రత్యేక పాటలో జోడి కట్టనుంది. తమన్నా క్రేజ్ ఒక రేంజ్లో ఉంది కనుక, స్పెషల్ సాంగ్కి ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.