శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (19:39 IST)

ఖుషీలో కుర్రకారును చిత్తుచిత్తు చేసిన భూమిక చివరికి ఇలా సెటిలయింది...

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ఎంసీఏ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న సినీ యూనిట్ ఓ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను వదినగా నటించిన భూమ

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ఎంసీఏ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వున్న సినీ యూనిట్ ఓ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను వదినగా నటించిన భూమిక గురించి చెప్పుకొచ్చారు. 
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమిక నటించిన ''ఖుషీ'' సినిమా టిక్కెట్ల కోసం లైన్‌లో నిలబడకుండా.. వేరే లైన్‌ను క్రియేట్ చేసినందుకు పోలీసులు తనను చితక్కొట్టారని చెప్పాడు. అలాంటి హీరోయిన్‌ తనకు వదినగా నటిస్తున్నప్పుడు ఎంతో ఎగ్జైట్‌గా ఫీలయ్యానని నాని వ్యాఖ్యానించాడు. 
 
ఖుషీ సినిమా టిక్కెట్ల కోసం తన్నులు తిన్న విషయాన్ని భూమికకు చెప్తే ఆమె నవ్వుకున్నారని.. ఈ సినిమా షూటింగ్ తమను ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మార్చేశాయని చెప్పాడు. సినిమా పూర్తయ్యేలోపు ఆవిడ తనకు సొంత వదినలా మారిపోయారని తెలిపాడు. వాళ్లబ్బాయి కోసం షాపింగ్ చేసేటప్పుడు, మా అబ్బాయికి కూడా బొమ్మలు కొని తెచ్చేవారని తెలిపాడు.
 
ఇదిలా ఉంటే.. హ్యాట్రిక్ విజ‌యాలతో మంచి ఊపుమీద ఉన్న నాని న‌టిస్తున్న తాజా చిత్రం ఎంసీఏ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. ఈ చిత్రంలో భూమిక.. నానికి వదినగా కనిపించబోతుంది.